భారీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు

by Disha Web Desk 2 |
భారీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన ఉగ్రమూకలు ఎదురు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఉగ్రవాద సంస్థ ఎల్‌ఈటీ (టీఆర్‌ఎఫ్)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు, ఉగ్రవాది లతీఫ్ రాథర్‌తో సహా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాహుల్ భట్, అమ్రీన్ భట్ సహా పలువురు పౌరుల హత్యల్లో ఉగ్రవాది లతీఫ్ ప్రమేయం ఉందని కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌ను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. సర్కార్‌కు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరిక


Next Story

Most Viewed